*కార్మిక హక్కులు కాలరాసే నాలుగు లేబర్ కోట్స్ ను రద్దు చేయాలి*
*ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ డిమాండ్*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * ఉదయం 11 గంటలకి అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లలిత జ్యువెలరీ వద్ద నుండి కేంద్ర ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా, కార్మిక వర్గానికి ద్రోహం చేసే విధంగా ఉన్న నాలుగు లేబర్ కోట్స్ రద్దు చేయాలని, కార్పొరేట్ ప్రయోజనాలు కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ కార్మిక ప్రదర్శన నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ గారు ప్రసంగిస్తూ నేడు దేశవ్యాప్తంగా కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు జరుగుతున్నాయని తెలియజేస్తూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 11సంవత్సరాల కాలంలో అదాని, అంబానీ సేవలో ఉంటూ కార్పొరేటు సంస్థలకు పెద్దపీట వేస్తూ వారి మోచేతి నీళ్లు తాగే విధంగా నరేంద్రమోడీ వ్యవహరిస్తూ కార్మికు వర్గానికి ద్రోహం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు . గత 5 సంవత్సరాల నుండి కార్మికులకు దేశవ్యాప్తంగా లేబర్ కోట్స్ రద్దు కొరకు పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వం కార్మికు వర్గాన్ని యజమానులకు ఊడిగం చేసే లేబర్ కోట్స్ దేశవ్యాప్తంగా అమలయ్య విధంగా నోటిఫికేషన్ విడుదల చేయడానికి తీవ్రంగా తప్పుపట్టారు. స్వతంత్రం రాక పూర్వం నుంచి ఈ దేశంలో ఉన్న 44 కార్మిక చట్టాల్ని కార్మిక వర్గం ప్రాణ త్యాగాలు చేసి అనేక ఉద్యమాల ద్వారా సంపాదించుకున్న చట్టాలను ఈరోజు మోడీ రద్దు చేయడం అంటే కార్మికు వర్గానికి ద్రోహం చేయడం తప్ప మరి ఒకటి కాదని తెలియజేశారు. లేబర్ కోట్స్ అమలు అయితే యజమానుల ఇష్టారాజ్యంగా ఉంటాదని ఎప్పుడు బడితే అప్పుడు పని నుండి తొలగించే హక్కు పూర్తిగా వారికి వస్తాదని అన్నారు . కార్మికులు సమ్మె చేయడానికి వీలులేదని, సమస్యలపై ఆందోళనలో చేసే హక్కు లేదని , ప్రశ్నించే హక్కు కోల్పోతారని 8 గంటల పని దినాన్ని 12 గంటలు పెంచుతారని ఈ లేబర్ కోడ్స్ చెబుతున్నాయని అన్నారు. కార్మికులు సమస్యలపై సమ్మెలో నిర్వహిస్తే జైలు శిక్షలు విధించే విధంగా ఈ లేబర్ కోట్స్ ఉన్నాయని అన్నారు . దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్స్ రద్దు కొరకు పోరాటాలు ఉద్యమాలు నిర్వహించడం ద్వారా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఎం మన్మధరావు జి.ఎస్.జే అచ్యుతరావు, సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కే ఎస్ వి కుమార్, ఐ ఎన్ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, సీఐఎఫ్టియు జాతీయ నాయకులు కనకారావు గారు, ఏ సి సి టి యు కార్యదర్శి వాసుదేవరావు, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు కసిరెడ్డి సత్యనారాయణ, కే సత్య ఆంజనేయ, సీఐటీయూ నాయకులు జగన్, మని , ఏఐటియుసి కార్యదర్శి జి వామనమూర్తి సిహెచ్ కాశి బాబు తదితరులు పాల్గొన్నారు

కార్మిక హక్కులు కాలరాసే నాలుగు లేబర్ కోట్స్ ను రద్దు చేయాలి*
*కార్మిక హక్కులు కాలరాసే నాలుగు లేబర్ కోట్స్ ను రద్దు చేయాలి* *ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ డిమాండ్* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * ఉదయం 11 గంటలకి అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లలిత జ్యువెలరీ వద్ద నుండి కేంద్ర ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా, కార్మిక వర్గానికి ద్రోహం చేసే విధంగా ఉన్న నాలుగు లేబర్ కోట్స్ రద్దు చేయాలని, కార్పొరేట్ ప్రయోజనాలు కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ కార్మిక ప్రదర్శన నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ గారు ప్రసంగిస్తూ నేడు దేశవ్యాప్తంగా కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు జరుగుతున్నాయని తెలియజేస్తూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 11సంవత్సరాల కాలంలో అదాని, అంబానీ సేవలో ఉంటూ కార్పొరేటు సంస్థలకు పెద్దపీట వేస్తూ వారి మోచేతి నీళ్లు తాగే విధంగా నరేంద్రమోడీ వ్యవహరిస్తూ కార్మికు వర్గానికి ద్రోహం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు . గత 5 సంవత్సరాల నుండి కార్మికులకు దేశవ్యాప్తంగా లేబర్ కోట్స్ రద్దు కొరకు పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వం కార్మికు వర్గాన్ని యజమానులకు ఊడిగం చేసే లేబర్ కోట్స్ దేశవ్యాప్తంగా అమలయ్య విధంగా నోటిఫికేషన్ విడుదల చేయడానికి తీవ్రంగా తప్పుపట్టారు. స్వతంత్రం రాక పూర్వం నుంచి ఈ దేశంలో ఉన్న 44 కార్మిక చట్టాల్ని కార్మిక వర్గం ప్రాణ త్యాగాలు చేసి అనేక ఉద్యమాల ద్వారా సంపాదించుకున్న చట్టాలను ఈరోజు మోడీ రద్దు చేయడం అంటే కార్మికు వర్గానికి ద్రోహం చేయడం తప్ప మరి ఒకటి కాదని తెలియజేశారు. లేబర్ కోట్స్ అమలు అయితే యజమానుల ఇష్టారాజ్యంగా ఉంటాదని ఎప్పుడు బడితే అప్పుడు పని నుండి తొలగించే హక్కు పూర్తిగా వారికి వస్తాదని అన్నారు . కార్మికులు సమ్మె చేయడానికి వీలులేదని, సమస్యలపై ఆందోళనలో చేసే హక్కు లేదని , ప్రశ్నించే హక్కు కోల్పోతారని 8 గంటల పని దినాన్ని 12 గంటలు పెంచుతారని ఈ లేబర్ కోడ్స్ చెబుతున్నాయని అన్నారు. కార్మికులు సమస్యలపై సమ్మెలో నిర్వహిస్తే జైలు శిక్షలు విధించే విధంగా ఈ లేబర్ కోట్స్ ఉన్నాయని అన్నారు . దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్స్ రద్దు కొరకు పోరాటాలు ఉద్యమాలు నిర్వహించడం ద్వారా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఎం మన్మధరావు జి.ఎస్.జే అచ్యుతరావు, సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కే ఎస్ వి కుమార్, ఐ ఎన్ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, సీఐఎఫ్టియు జాతీయ నాయకులు కనకారావు గారు, ఏ సి సి టి యు కార్యదర్శి వాసుదేవరావు, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు కసిరెడ్డి సత్యనారాయణ, కే సత్య ఆంజనేయ, సీఐటీయూ నాయకులు జగన్, మని , ఏఐటియుసి కార్యదర్శి జి వామనమూర్తి సిహెచ్ కాశి బాబు తదితరులు పాల్గొన్నారు

