కార్మిక హక్కులపై వేటు – నైట్ షిఫ్ట్పై స్పష్టత లేదు: సిఐటియు
నల్లజర్ల(దూబచర్ల), జూన్ 24:
కార్మిక హక్కులపై కేంద్రాన్ని అనుసరిస్తూ రాష్ట్రం దాడికి దిగుతుండటం సిగ్గుచేటని సిఐటియు జిల్లా నాయకుడు కొక్కిరిపాటి వెంకట్రావు మండిపడ్డారు. “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” పేరిట 8 గంటల పని సమయాన్ని 10 గంటలకు పెంచడం, ఓవర్టైమ్ను నిర్బంధంగా చేయడం, మహిళలకు నైట్ షిఫ్ట్ను తప్పనిసరిగా ప్రకటించడం అన్యాయమని విమర్శించారు. మహిళల భద్రత, ఏర్పాట్లపై స్పష్టతలేకపోవడాన్ని తప్పుపడుతూ, కార్మికులు ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.