ఒకవైపు పుట్టబోయే బిడ్డ గురించి ఆందోళన..
మరోవైపు ఆఫీసు నిబంధనలు. వైద్యులు బెడ్ రెస్ట్ అవసరమని పదేపదే హెచ్చరిస్తున్నా..
ఆ కార్పొరేట్ సంస్థ కనికరం చూపలేదు.
ఇంటి నుంచి పని చేస్తా అని వేడుకున్నా.. ఆఫీసుకి రావాల్సిందే అని హుకూం జారీ చేసింది.
ఆ మొండితనమే చివరకు ఓ పసిప్రాణాన్ని బలితీసుకుంది.
బిడ్డను కోల్పోయిన ఓ తల్లి ఆవేదనకు.. మానవత్వం మరిచి ప్రవర్తించిన ఆ దిగ్గజ సంస్థకు బుద్ధి చెబుతూ.. కోర్టు ఇప్పుడు అక్షరాలా రూ.210 కోట్ల పరిహారంతో తీర్పు ఇచ్చింది.


