– 44వ వార్డు సభ్యురాలుగా పార్శీ సరిత
కామారెడ్డి, 04 ఫిబ్రవరి,( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి పట్టణంలో 44వ వార్డు సరిత పోటీ లోకామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల హోరు ఊపందుకుంది. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ 44వ వార్డు సభ్యురాలి స్థానానికి పార్టీ సరిత నామినేషన్ దాఖలు చేసి బరిలోకి దిగారు. ఎన్నిక ల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ,పార్శీ సరిత, అందరూ 44వ వార్డు అభివృద్ధిని కోరుకుంటున్నా మని చెప్పారు. ఈ లక్ష్యంతోనే నేను పోటీ చేస్తు న్నాను అని అన్నారు.వార్డు సర్వంగా అభివృద్ధి కోసం మా నామినేషన్ దాఖలైంది. ప్రజలు మాకు భారీ ఓట్ల మద్దతు ఇచ్చి, ఈ వార్డును అభివృద్ధి మాదిరిగా మార్చే అవకాశం కల్పిస్తారని నమ్ముతు న్నాను అని అన్నారు. ఈ వార్డులో మున్సిపల్ సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రజల సమస్యలు పరిష్కరించడం తమ ప్రధాన లక్ష్యమని సరిత స్పష్టం చేశారు.స్థానిక ప్రజలు సరిత అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తూ, ఎన్నికల్లో వారికి మద్దతు ప్రకటించా రు. కామారెడ్డి పట్టణ మున్సిపల్ ఎన్నికలు ప్రజల అభివృద్ధి సంకల్పానికి మైలురాయిగా మారతాయ ని ఆశాభావం వ్యక్తం చేశారు.


