గ్రామస్తులు భయాందోళనలో… జిల్లా ప్రజలు
కామారెడ్డి, 29 డిసెంబర్,( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా గర్గుల వంటి గ్రామాల్లో నాటు బాంబుల పేలుడు ఘటనలు కలకలం రేపాయి. శనివారం పొలం నాటు పనులలో నిమగ్నమై ఉన్నారు ఒక్కసారిగా ఈ పేలుడులతో ఒక కుక్క మృతి చెందడంతో స్థానికులు భయంగా మారారు. ఈ ఘటన గ్రామంలో ఉద్విగ్న వాతావరణాన్ని సృష్టించింది.గర్గుల గ్రామంలో ఉదయం10 గంటల సమయంలో ఆకస్మికంగా నాటు బాంబులు పేలా యి. ఈ పేలుడుల సౌండ్తో గ్రామస్తులు షాక్లో పడ్డారు. సమీపంలో ఉన్న ఒక కుక్క ఈ పేలుడు లతో తీవ్రంగా గాయపడి మరణించింది.ఈ ఘటన గ్రామంలోని పొలాలు, రోడ్ల సమీపంలో జరిగినట్టు తెలుస్తోంది.స్థానికులు ఈనాటు బాంబులు ఎవరు, ఎందుకు అమర్చారో తెలియకపోవడంతో భయ పడుతున్నారు.ఈ బాంబులు పొరుగు గ్రామాల్లో నూ వినిపించాయి. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఈ పేలుడులు దేశీయంగా తయారు చేసినవి కావ చ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో నాటు బాంబుల వాడకం పెరు గుతున్నట్టు హెచ్చరిస్తోంది. పొలాల్లో జంతువులు, పక్షులను తడబడటానికి ఈ బాంబులు ఉపయోగి స్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే, అనియంత్రితంగా వాడటం వల్ల ప్రమాదాలు జరు గుతున్నాయి. గత కొన్ని నెలల్లో ఈ జిల్లాలో ఇలాం టి ఘటనలు జరిగాయి.పోలీసులు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ స్తులు ఈ బాంబులు తయారు చేసే వారిని గుర్తిం చి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిం చారు. ఈ ఘటనతో గర్గుల గ్రామంలో ఉద్విగ్నత మొదలైంది.


