కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దె చోడ్ కార్యక్రమం
శ్రీకాళహస్తి
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు, ఏ.పీ.సీ.సీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు సోనియా గాంధీ విచార్ మంచ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు అర్జున గురుమూర్తి, అధ్యక్షతన ఓట్ చోర్ గద్దె ఛోడ్ నిరసన కార్యక్రమం మంగళం వారం నాయుడుపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి కార్యదర్శి భాస్కర్ రావు, తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ కరీముల్లా, నాయుడుపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాగూర్, మాజీ జనరల్ సెక్రెటరీ నిత్యానందం పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ,భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ ,ఇచ్చి నటువంటి రాజ్యాంగ విరుద్ధంగా దొంగ ఓట్ల గెలుపుతో పరిపాలన చేస్తున్నారని రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజల ఓటు హక్కులను హరించి వేస్తున్నారని ఎన్నికల కమిషనర్ కి రాహుల్ గాంధీ మీడియా ముందర అనేక రాష్ట్రాలలో కొన్ని లక్షల దొంగ ఓట్లను సాక్షాధారాలతో మీడియా ముందు బయటపెట్టిన ఇంతవరకు సమాధానం చెప్పలేదని చెప్పారు.దొంగ ఓట్లతో గద్దె ఎక్కిన నరేంద్ర మోడీ గద్దె దిగే వరకు మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు మొదలవుతాయని హెచ్చరించారు. నరేంద్ర మోడీ ,ఓటు దొంగ గద్దె దిగు ఓట్ చోర్ గద్దె ఛోడ్ అను నివాదంతో నిరసన కార్యక్రమం చేపట్టి సంతకాల సేకరణ కార్యక్రమం చేశారు.


