శ్రీ పరాభవ ఉగాది సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు ద్వారా సాహిత్య విభాగంలో ప్రతిష్టాత్మక కళారత్న పురస్కారం అందుకున్న నెల్లూరు ఆడిటర్ సుప్రసిద్ధ తెలుగు కవి చిన్ని నారాయణ రావును ఆదివారం ఉదయం వారి నివాసంలో నెల్లూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం తరఫున అభినందన పూర్వక సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు. తిక్కన నడయాడిన నేల మీద సాహిత్యంలో ఎవరు ఏ గౌరవం తెచ్చినా గత ఐదు దశాబ్దాలుగా అభినందించడం ఆనవాయితీగా చేస్తున్నట్లు అరసం నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షులు, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ అన్నారు. అరసం జిల్లా అధ్యక్షులు , సాహిత్య అకాడమీ బాలసాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ సాహిత్య రంగం లో అత్యున్నత అవార్డు పొందిన నారాయణ రావు చేసిన కృషి గొప్పదన్నారు.అరసం జిల్లా కార్యదర్శి అవ్వారు శ్రీధర్ బాబు కవిత్వం రాయడమే కాకుండా సాటి కవులకు పురస్కార ప్రదానం చేయడం అరుదైన విషయం అంటూ ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. మే నెలలో తన తాజా కవితా సంపుటి వెలువరించనున్నట్లు అవార్డు గ్రహీత చిన్ని నారాయణ అన్నారు.

కళారత్న పురస్కార గ్రహీతకు అరసం అభినందన సత్కారం
శ్రీ పరాభవ ఉగాది సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు ద్వారా సాహిత్య విభాగంలో ప్రతిష్టాత్మక కళారత్న పురస్కారం అందుకున్న నెల్లూరు ఆడిటర్ సుప్రసిద్ధ తెలుగు కవి చిన్ని నారాయణ రావును ఆదివారం ఉదయం వారి నివాసంలో నెల్లూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం తరఫున అభినందన పూర్వక సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు. తిక్కన నడయాడిన నేల మీద సాహిత్యంలో ఎవరు ఏ గౌరవం తెచ్చినా గత ఐదు దశాబ్దాలుగా అభినందించడం ఆనవాయితీగా చేస్తున్నట్లు అరసం నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షులు, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ అన్నారు. అరసం జిల్లా అధ్యక్షులు , సాహిత్య అకాడమీ బాలసాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ సాహిత్య రంగం లో అత్యున్నత అవార్డు పొందిన నారాయణ రావు చేసిన కృషి గొప్పదన్నారు.అరసం జిల్లా కార్యదర్శి అవ్వారు శ్రీధర్ బాబు కవిత్వం రాయడమే కాకుండా సాటి కవులకు పురస్కార ప్రదానం చేయడం అరుదైన విషయం అంటూ ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. మే నెలలో తన తాజా కవితా సంపుటి వెలువరించనున్నట్లు అవార్డు గ్రహీత చిన్ని నారాయణ అన్నారు.

