గాజువాక, అక్టోబర్ 14 (పున్నమి ప్రతినిధి)
కల్తీ మద్యాన్ని ప్రోత్సహిస్తూ, తద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో అస్థిరపాలు చేయాలని కుట్రలు పన్నిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి మరియు ఆయన చెంచా పాత్రధారి జోగి రమేష్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, 67వ వార్డ్ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు సమావేశమై, వైసీపీ చేస్తున్న కుట్రలు, నీచమైన రాజకీయాలను ఎండగట్టాలని తీర్మానించారు. రాజకీయాలలో కొనసాగేందుకు నైతిక అర్హత జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ పార్టీ కోల్పోయిందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ బి.సి. సెల్ అధ్యక్షులు తమిరి శివప్రసాదరావు, వార్డ్ అధ్యక్షులు సింగూరు అనంత్, అక్కిన లక్ష్మణరావు, గాజువాక నియోజకవర్గ టీడీపీ ప్రతినిధులు బొడ్డ వెంకటరమణ, దొడ్డి సత్యరావు, బైపిల్లి గాంధీ, సింగంపల్లి దేవుడు, గుర్రం నూకరాజు, మాతా సంతోషి, రాష్ట్ర అగ్నికులక్షత్రియ డైరెక్టర్ అంగ కృష్ణ, టీడీపీ బి.సి. నాయకులు పోతిన వెంకటేశ్వరరావు, అజయ్ చౌదరి, పచ్చికూర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


