శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తిలోని స్థానిక పాల సొసైటీ కేంద్రాన్ని శుక్రవారం నాడు ఫుడ్ ఇన్స్పెక్టర్ జగదీష్ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ పాలను అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసింది. గురువారం నాడు పాల కేంద్రంలోని నిల్వలను పరిశీలించిన అధికారులు, పాల నాణ్యతను పరీక్షించేందుకు కొన్ని నమూనాలను సేకరించారు. ఈ సందర్బంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ…. సేకరించిన పాల నమూనాలను విశ్లేషణ కోసం ల్యాబొరేటరీకి పంపనున్నట్లు అయన వెల్లడించారు. పాలను నిల్వ చేసే విధానం, పరిసరాల పరిశుభ్రతపై సొసైటీ కేంద్రం నిర్వహుకులను ఆరా తీశారు. స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్లలో మాత్రమే పాలను భద్రపరచాలని, ప్లాస్టిక్ లేదా అల్యూమినియం డబ్బాలను వాడవద్దని పాల నాణ్యతలో లోపాలున్నా లేదా కల్తీకి పాల్పడినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జగదీష్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కల్తీకి పాల్పడే వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పాల కేంద్రాలు, విక్రయ కేంద్రాల్లో ఈ తనిఖీలు కొనసాగుతాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానం కలిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ విభాగం సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కల్తీ పాలపై ‘ఫుడ్ సేఫ్టీ’ పంజా-పాల సొసైటీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తిలోని స్థానిక పాల సొసైటీ కేంద్రాన్ని శుక్రవారం నాడు ఫుడ్ ఇన్స్పెక్టర్ జగదీష్ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ పాలను అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసింది. గురువారం నాడు పాల కేంద్రంలోని నిల్వలను పరిశీలించిన అధికారులు, పాల నాణ్యతను పరీక్షించేందుకు కొన్ని నమూనాలను సేకరించారు. ఈ సందర్బంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ…. సేకరించిన పాల నమూనాలను విశ్లేషణ కోసం ల్యాబొరేటరీకి పంపనున్నట్లు అయన వెల్లడించారు. పాలను నిల్వ చేసే విధానం, పరిసరాల పరిశుభ్రతపై సొసైటీ కేంద్రం నిర్వహుకులను ఆరా తీశారు. స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్లలో మాత్రమే పాలను భద్రపరచాలని, ప్లాస్టిక్ లేదా అల్యూమినియం డబ్బాలను వాడవద్దని పాల నాణ్యతలో లోపాలున్నా లేదా కల్తీకి పాల్పడినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జగదీష్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కల్తీకి పాల్పడే వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పాల కేంద్రాలు, విక్రయ కేంద్రాల్లో ఈ తనిఖీలు కొనసాగుతాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానం కలిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ విభాగం సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

