కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్…!
ప్రజల ఆరోగ్యాలను గాల్లో వదిలేసిన అధికారులు…!
పున్నమి న్యూస్ ప్రతినిధి
31 మార్చి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్:
బహిరంగంగా చెత్త కాల్చివేయడం రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ రంగారెడ్డి జిల్లాలో దీనికి విరుద్ధంగా ఉంది. ప్లాస్టిక్ దీర్ఘాలు చెత్త బహిరంగంగా కాల్చోద్దని కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆదేశాలు ఉండగా ఆదిభట్ల గ్రేటర్ పరిధిలో ఎక్కడికక్కడ చెత్త కాల్చితూనే ఉన్నారు. గతంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని అధికారిని విశ్వసనీయ సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని జరిమానా విధించారు. గ్రేటర్లు విలీనమయ్యాక అధికారుల తీరు విభిన్నం గా మారింది. బ్రాహ్మణపల్లి లోని గోడౌన్లో నిత్యం ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చడమే అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది. అధికారుల మధ్య సమన్వయ లోపమా శాఖ పరమైన లోపమా అనేది అధికారులు తీర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన లాభం లేదని స్థానికులు అంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చడం ద్వారా గాలిలో నాణ్యత లోపిస్తుందని ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయని కంటిచూపులో సమస్యలు ఎదురవుతాయని ప్రభుత్వం చెత్త కాల్చివేయడం నిషేధం విధించింది. కానీ ప్రజలకు వ్యాపార సంస్థలకు చిత్త కాల్చివేయడం నిషేధంపై అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని పలువురు వాపోతున్నారు.







