నంద్యాల వఖ్ఫ్ జమీన్ బచావో సంఘటన్ ప్రతినిధులు మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసి కుర్నూలు నగరంలో నూతన ఈద్గా నిర్మాణ పనులను ప్రారంభించాలని విన్నవించుకోగా స్పందించిన రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పనులు మొదలుపెట్టుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా వఖ్ఫ్ జమీన్ బచావో సంఘటన్ నాయకులు మాట్లాడుతూ ముస్లింల చిరకాల కోరికైన ఈద్గా నిర్మాణం పట్ల మంత్రి ఫరూక్ ప్రత్యేక శ్రద్ధ చూపడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈద్గా పనుల ప్రారంభానికి సహకరించినందుకు సంఘటన్ తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘటన్ ప్రతినిధులు షేక్ హుస్సేన్, ఎస్. మహమ్మద్ మెయిన్, షేక్ సుల్తాన్, షేక్ ఖలేందర్ బాషా, షేక్ అన్వర్ బాషా, నంద్యాల ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ భాషా సిద్ధికి తదితరులు పాల్గొన్నారు.


