పలమనేరులో కొలువై ఉన్న సత్య గంగమ్మ అమ్మవారిని శుక్రవారం కరెన్సీ నోట్లతో విశేషంగా అలంకరించారు. వరలక్ష్మీ వ్రతం కావడంతో ధనలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఈ అలంకరణ కోసం 6 లక్షల కొత్త కరెన్సీ నోట్లు ఉత్సవ కమిటీ ఉపయోగించింది. 200, 500 నోట్లను అమ్మవారి అలంకరణకు వినియోగించారు. అంతేకాదు ఆలయాన్ని కరెన్సీ నోట్లతో అందంగా ముస్తాబు చేశారు. అచ్చం పులాకృతిలో ఉండేలా నోట్లను అక్కడ ఏర్పాటు చేశారు. రంగు రంగు పూల మాదిరిగానే కరెన్సీ నోట్లు చూపరులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు.
కరెన్సీ నోట్లతో అలంకార శోభితమైన అమ్మవారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు. కోర్కెలు నెరవేర్చాలని, ప్రజలను చల్లగా చూడాలని కరెన్సీ నోట్లతో అలంకరణ చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

కరెన్సీ నోట్లతో సత్య గంగమ్మ అమ్మవారికి అలంకరణ
పలమనేరులో కొలువై ఉన్న సత్య గంగమ్మ అమ్మవారిని శుక్రవారం కరెన్సీ నోట్లతో విశేషంగా అలంకరించారు. వరలక్ష్మీ వ్రతం కావడంతో ధనలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఈ అలంకరణ కోసం 6 లక్షల కొత్త కరెన్సీ నోట్లు ఉత్సవ కమిటీ ఉపయోగించింది. 200, 500 నోట్లను అమ్మవారి అలంకరణకు వినియోగించారు. అంతేకాదు ఆలయాన్ని కరెన్సీ నోట్లతో అందంగా ముస్తాబు చేశారు. అచ్చం పులాకృతిలో ఉండేలా నోట్లను అక్కడ ఏర్పాటు చేశారు. రంగు రంగు పూల మాదిరిగానే కరెన్సీ నోట్లు చూపరులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. కరెన్సీ నోట్లతో అలంకార శోభితమైన అమ్మవారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు. కోర్కెలు నెరవేర్చాలని, ప్రజలను చల్లగా చూడాలని కరెన్సీ నోట్లతో అలంకరణ చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

