పువ్వాడ నాగేంద్ర కూమర్
(తెలంగాణ పున్నమి ప్రతి నిధి)
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల ఫీజు భారం లేకుండా చేయాలని కరీంనగర్ ఎంపీ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి
బండి సంజయ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజును తన వేతనం నుండి పూర్తిగా చెల్లించనున్నట్టు ప్రకటించారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 12,292 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్నారు.
కరీంనగర్ జిల్లా – 4,847 మంది
సిరిసిల్ల జిల్లా – 4,059 మంది
సిద్ధిపేట జిల్లా – 1,118 మంది
జగిత్యాల జిల్లా – 1,135 మంది
హన్మకొండ జిల్లా – 1,133 మంది
వారి పరీక్ష ఫీజుల కోసం సుమారు ₹15 లక్షలు అవసరమవుతాయని, ఆ మొత్తాన్ని తన వేతనం నుండి భరించనున్నట్టు ఎంపీ తెలిపారు.
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే లేఖలు పంపించారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రేరణతో, “వికసిత్ భారత్” కల సాకారం చేయడంలో తన వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు.


