


శ్రీకాకుళం రూరల్ మండలంలోని కరజాడ గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు నిర్వహించిన వినాయక నిమజ్జన ఊరేగింపులో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ సభ్యులు మరియు గ్రామ దేవాలయ నిర్వాహకులు ప్రశంసలు అందుకున్నారు.
భక్తుల్లో ఉత్సాహం నింపడానికి భాగంగా లక్కీ డ్రాను నిర్వహించారు. విజేతలకు గురువారం నిర్వహించిన కార్యక్రమంలో బహుమతులు అందజేశారు.
- మొదటి బహుమతి: పొడుగు గణేష్
- రెండవ బహుమతి: బలగ రామరాజు
- మూడవ బహుమతి: యాత రామ కుమారుడు సుధీర్
ఈ లక్కీ డ్రా కార్యక్రమం కరజాడ మెయిన్ రోడ్ పెద్దలు మరియు యూత్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
➡️ గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రతీ ఏటా ఇలాగే ఉత్సవాలను ఆనందోత్సాహాలతో కొనసాగించాలని సంకల్పం వ్యక్తం చేశారు.

