*శ్రీ కనకమహాలక్ష్మి ఆశీస్సులు విశాఖపై ఉండాలి*
*మొక్కుబడి చెల్లించు కున్న వాసుపల్లి కుటుంబం*
*ప్రత్యేక పూజలు పంచామృతాభిషేకం చేసిన వాసుపల్లి దంపతులు*
*విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి *
శ్రీ కనకమహాలక్ష్మి ఆశీస్సులు విశాఖపై ఉండాలని వైసీపీ పార్టీ నాయకులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు ఉత్తరాంధ్ర ఇలవేల్పు కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసో త్సవాల్లో భాగంగా ఈరోజు మూడవ గురువారం పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా వాసుపల్లి కుటుంబ సభ్యులు అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి గర్భాలయంలో పంచామృతాని షేకంతో పూజలు చేశారు అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మూడవ గురువారం అమ్మవారిని దర్శించుకుని ఆమె ఆశీస్సులు పొందడానికి వేలాది మంది భక్తులు తరలిరావడం జరిగిం దన్నారు కోరిన వరాలు ఇచ్చే కల్పవల్లిగా పేరున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్స వాలు ఘనంగా జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు
విశాఖతో పాటు ఇతరజిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అమ్మవారు దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారని చెప్పారు పిల్లల నుంచి వృద్ధుల వరకు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని దర్శించుకుని ఆమె కరుణా కటాక్షాలు పొందారన్నారు అమ్మవారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మంచే జరుగు తుందని చెప్పారు విశాఖ పై అలాగే ఈ ప్రాంత ప్రజలపై ఆమె చల్లని చూపులు ఉండాలని ఉండాలని కోరు తున్నట్లు ఆయన ఆకాం క్షించారు.


