శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీసమేతంగా ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంను బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ పండితుల ఆశీర్వాదాలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. .. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల సమస్యలు తొందరగా పరిష్కారం కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుననాని, జగన్మాత కనకదుర్గమ్మ తల్లి చల్లని దృష్టి ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని, సమాజంలో శాంతి, ఐక్యత నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. ఈ దర్శనం తనకు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిందని, ప్రజా సేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగేందుకు ప్రేరణనిచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కనకదుర్గమ్మను దర్శించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి – ప్రజాశ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు
శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీసమేతంగా ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంను బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ పండితుల ఆశీర్వాదాలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. .. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల సమస్యలు తొందరగా పరిష్కారం కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుననాని, జగన్మాత కనకదుర్గమ్మ తల్లి చల్లని దృష్టి ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని, సమాజంలో శాంతి, ఐక్యత నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. ఈ దర్శనం తనకు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిందని, ప్రజా సేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగేందుకు ప్రేరణనిచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

