కడప రిమ్స్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులను పట్టుకున్నారు. సదరం సర్టిఫికేట్ మంజూరుకు లంచం అడిగినట్లు ఫిర్యాదు అందడంతో వాళ్లని దాడులు చేశారు. ఈ సందర్భంగా 30,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో సదరం వింగ్ సూపర్డెంట్ మరియు, జూనియర్ అసిస్టెంట్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.


