Wednesday, 25 March 2026
  • Home  
  • కంపసముద్రం ‘స్తంభారాయుని’ క్షేత్రంలో జనవరి 1న విశేష పూజలు
- తిరుపతి

కంపసముద్రం ‘స్తంభారాయుని’ క్షేత్రంలో జనవరి 1న విశేష పూజలు

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేలు మండలం కంపసముద్రం పంచాయతీ పరిధిలోని గుడ్లవారిపల్లె గ్రామంలో వెలసిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ స్తంభారాయు స్వామి ఆలయం నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబైంది. ప్రతి ఏటా జనవరి 1న స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బుధవారం స్వామివారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ, గ్రామస్తులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉదయం 7 గంటల నుంచే విశేష అభిషేకాలు, ఫలపుష్ప అలంకరణలు, హారతులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. స్వామివారిని నూతన ఏడాది తొలిరోజున దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రత్యేకతగా పేరుగాంచిన పొంగుబాలు సమర్పణ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకునేందుకు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి చెక్కభజనలు నిర్వహించడంతో పాటు రోజంతా నిరంతర అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకుని వేడుకను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేలు మండలం కంపసముద్రం పంచాయతీ పరిధిలోని గుడ్లవారిపల్లె గ్రామంలో వెలసిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ స్తంభారాయు స్వామి ఆలయం నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబైంది. ప్రతి ఏటా జనవరి 1న స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బుధవారం స్వామివారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ, గ్రామస్తులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉదయం 7 గంటల నుంచే విశేష అభిషేకాలు, ఫలపుష్ప అలంకరణలు, హారతులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. స్వామివారిని నూతన ఏడాది తొలిరోజున దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రత్యేకతగా పేరుగాంచిన పొంగుబాలు సమర్పణ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకునేందుకు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి చెక్కభజనలు నిర్వహించడంతో పాటు రోజంతా నిరంతర అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకుని వేడుకను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.