చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు నుంచి చేజర్ల మండలం వెళ్లే రోడ్డు మార్గం పడమటి కండ్రిక వద్ద రోడ్డు కుంగిపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో భారత మహాసేన పార్టీ నాయకులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. తరువాత రోజు అధికారులు హుటాహుటిన కంకరతో మరమ్మత్తు పనులు ప్రారంభించినప్పటికీ,దాదాపు 20 రోజులు గడిచినా పూర్తి స్థాయిలో పనులు జరగలేదు.వేసిన కంకర అలాగే ఉండి, దానిపై తారు వెయ్యలేదు. పూర్తిస్థాయిలో మరమ్మత్తు పనులు చేపట్టలేదు. దీంతో నిన్న రాత్రి ద్విచక్ర వాహనదారుడు జారి పడిన సంఘటన కూడా జరిగింది.వాహనదారులు మళ్లీ ప్రమాదాల బారిన పడుతున్నారు.ఈ పరిస్థితిని గమనించి అధికారులు తక్షణమే శాశ్వత మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు,ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.


