వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 14 నెలలైనా పట్టించుకోలేదని ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా వెంకటయ్య అన్నారు. ఓబులవారిపల్లె మండలం మంగంపేట అగ్రహారంలో ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..1972లో ఎస్టీ జాబితాలో ఉన్న వడ్డెరలను బీసీ-ఏలోకి మార్చారని అన్నారు.

ఓబులవారిపల్లె: ‘వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి’
వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 14 నెలలైనా పట్టించుకోలేదని ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా వెంకటయ్య అన్నారు. ఓబులవారిపల్లె మండలం మంగంపేట అగ్రహారంలో ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..1972లో ఎస్టీ జాబితాలో ఉన్న వడ్డెరలను బీసీ-ఏలోకి మార్చారని అన్నారు.

