పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి మరియు డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు ఆదేశాల మేరకు ఓట్ చోర్ గద్దిచోడ్ కార్యక్రమంపై ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం శ్రీకాళహస్తి మండలం వాంపల్లి గ్రామం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన భూమిక పోషిస్తుందని,కానీ ఇంతటి స్వాతంత్ర్య ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలే ఓట్ల అవకతవకులకు పాల్పడుతుంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం అభాసు పాలవుతుందని రాబోవు రోజుల్లో ఇటువంటి అవకతవకలు జరగకుండా ప్రజల్లో చైతన్యం నింపడం కొరకు కాంగ్రెస్ పార్టీ ఓట్ చోర్ గద్దిచోడ్ కార్యక్రమాని తీవ్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళుతుందని తెలిపారు.

ఓట్ చోర్ గద్దిచోడ్ పై ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు
పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి మరియు డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు ఆదేశాల మేరకు ఓట్ చోర్ గద్దిచోడ్ కార్యక్రమంపై ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం శ్రీకాళహస్తి మండలం వాంపల్లి గ్రామం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన భూమిక పోషిస్తుందని,కానీ ఇంతటి స్వాతంత్ర్య ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలే ఓట్ల అవకతవకులకు పాల్పడుతుంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం అభాసు పాలవుతుందని రాబోవు రోజుల్లో ఇటువంటి అవకతవకలు జరగకుండా ప్రజల్లో చైతన్యం నింపడం కొరకు కాంగ్రెస్ పార్టీ ఓట్ చోర్ గద్దిచోడ్ కార్యక్రమాని తీవ్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళుతుందని తెలిపారు.

