Sunday, 7 December 2025
  • Home  
  • ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి కరోనా లాంటి ప్రమాదకరం –ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు బాల్ నింగని జంగయ్య*
- రంగారెడ్డి

ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి కరోనా లాంటి ప్రమాదకరం –ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు బాల్ నింగని జంగయ్య*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఏఐసీసీ, టీపీసీసీ, మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 15వ డివిజన్లో ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, కాంటెస్టేడ్ కార్పొరేటర్ బాల్ నింగని జంగయ్య ఆధ్వర్యంలో* ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, ఉన్న ఓట్లని తీసేసి లేని ఓట్లని చేర్చే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి జనాలని తీసుకొచ్చి ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో అక్కడ దొంగ ఓట్లను చేర్చుతున్నారు అని ఎద్దేవా చేశారు. కావున ఎన్నికల సంఘం మొత్తం బిజెపి కనుసన్నల్లో పనిచేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించినప్పటికీ నాలుగు నెలల్లోనే ఒక కోటి దొంగ ఓట్లను చేర్చిన ఘనత బిజెపి పార్టీకి దక్కిందని అని ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు బాల్నింగని జంగయ్య విమర్శించడం జరిగింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యే వారిని అనడం జరిగింది. రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా ప్రజలందరూ ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఉద్యమంలో భాగం కావాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ క్యారగారి శ్రీధర్,సీనియర్ నాయకులు నిరుడు శ్రీరాములు,జనరల్ ఎస్సీ డిపార్ట్మెంట్ సెక్రెటరీ కప్పటి ఆంజనేయులు,బి.ఎమ్.సి ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ ఎర్ర సురేందర్,జనరల్ సెక్రెటరీ బోర్ర రమేష్,మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఏఐసీసీ, టీపీసీసీ, మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 15వ డివిజన్లో ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, కాంటెస్టేడ్ కార్పొరేటర్ బాల్ నింగని జంగయ్య ఆధ్వర్యంలో* ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, ఉన్న ఓట్లని తీసేసి లేని ఓట్లని చేర్చే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి జనాలని తీసుకొచ్చి ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో అక్కడ దొంగ ఓట్లను చేర్చుతున్నారు అని ఎద్దేవా చేశారు. కావున ఎన్నికల సంఘం మొత్తం బిజెపి కనుసన్నల్లో పనిచేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించినప్పటికీ నాలుగు నెలల్లోనే ఒక కోటి దొంగ ఓట్లను చేర్చిన ఘనత బిజెపి పార్టీకి దక్కిందని అని ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు బాల్నింగని జంగయ్య విమర్శించడం జరిగింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యే వారిని అనడం జరిగింది. రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా ప్రజలందరూ ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఉద్యమంలో భాగం కావాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ క్యారగారి శ్రీధర్,సీనియర్ నాయకులు నిరుడు శ్రీరాములు,జనరల్ ఎస్సీ డిపార్ట్మెంట్ సెక్రెటరీ కప్పటి ఆంజనేయులు,బి.ఎమ్.సి ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ ఎర్ర సురేందర్,జనరల్ సెక్రెటరీ బోర్ర రమేష్,మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.