శ్రీసిటీ, జనవరి ,. పున్నమి ప్రతినిధి:
శ్రీసిటీ లో నిర్వహించిన “క్రియా యోగ ధ్యానం: ఒత్తిడి, ఆందోళనలకు శాశ్వత ఉపశమనం” కార్యక్రమంలో స్వామి స్మరణానంద ధ్యానం ఆధునిక జీవిత ఒత్తిడులను అధిగమించేందుకు పరమౌషదమని తెలిపారు. నిజమైన ఆనందం బయట కాదు, అంతరంగంలోనే ఉందని పేర్కొంటూ తైత్తిరీయ ఉపనిషత్తు, పరమహంస యోగానంద బోధనలను ఉదహరించారు. ధ్యానం శారీరక–మానసిక–ఆధ్యాత్మిక సమతుల్యతను పెంపొందిస్తుందని అన్నారు. హంస, ఓం, క్రియ యోగ ధ్యాన పద్ధతుల ప్రయోజనాలు వివరించారు. కార్యక్రమం అనంతరం పలువురు YSSI హోమ్–స్టడీ కోర్సులకు నమోదు చేసుకున్నారు. స్వామీజీ శ్రీసిటీ పరిసరాలను సందర్శించి ప్రశంసించారు.


