ఐదో రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆటో యూనియన్ సభ్యుల దీక్ష విరమింప చేసిన *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ,ముక్కా వరలక్ష్మి
రైల్వే కోడూరు పట్టణంలో జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న ఐదో రోజు రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్న ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వీరికి సంఘీభావం తెలుపుతు *ప్రభుత్వ విప్ రైల్వే కోడూర్ శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు,,రైల్వే కోడూర్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఎమ్మెల్యే ఆర్య శ్రీధర్ మాట్లాడుతూ మనం రాజంపేట జిల్లా కేంద్రం సాధించేవరకు ఇలాగే ప్రతిరోజు రిలే నిరాహార దీక్షలు ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు.


