ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా పరసా సుబ్బారావు (సాక్షి) ఎన్నికయ్యారు. రిపోర్టర్ గా 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సుబ్బారావు ఈనాడులో దీర్ఘ కాలంగా పనిచేశారు. ప్రస్తుతం సాక్షి అమలాపురం టౌన్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (apuwj) సంఘంలో ఆది నుంచి పనిచేసారు. సెప్టెంబర్ నెల చివరిలో బీహార్ లో జరిగే నేషనల్ కౌన్సిల్ సమావేశంలో సుబ్బారావు పాల్గొంటారు.


