నెల్లూరులోని ఏసిఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా జంగా శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్ రావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖలో 39 సంవత్సరాలుగా నిజాయితీగా సేవలందించిన శ్రీనివాసులు ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ పదవి నుండి పదోన్నతి పొంది ఏవోగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏపీ హంస నాయకత్వం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో అరవ పరిమళ, నారాయణరాజు, మజార్, హరిప్రసాద్, గౌస్ బాషా, మంజరి, సుజాత, లక్ష్మీకాంతమ్మ, విజయకుమారి, ప్రసన్న కుమార్, శ్రీనివాస్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.



