ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి :
సర్పంచుల, ఎంపీటీసీల, జడ్పీటీసీ ల సమస్యలు మరియు గ్రామీణ ప్రజల, గ్రామాల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన … వై.వి.బి రాజేంద్రప్రసాద్.
అమరావతి లోని సెక్రటేరియట్ నందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 శాతం భూభాగంలో నివసిస్తున్న మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఎంపీటీసీలు మరియు జడ్పీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు గ్రామీణ ప్రజల మరియు గ్రామాల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని రాజేంద్రప్రసాద్ తెలియజేశారు. .
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డిలు ఉన్నారు.
ఇట్లు
బిర్రు ప్రతాప్ రెడ్డి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్


