Sunday, 7 December 2025
  • Home  
  • ఏపీలో స్టీల్ రంగంలో పెట్టుబడులకు జపాన్ కంపెనీల ఆసక్తి*
- విశాఖపట్నం

ఏపీలో స్టీల్ రంగంలో పెట్టుబడులకు జపాన్ కంపెనీల ఆసక్తి*

*ఏపీలో స్టీల్ రంగంలో పెట్టుబడులకు జపాన్ కంపెనీల ఆసక్తి* *ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన భేటీలో జపాన్ రాయబారి ఒనో కేయిచ్చి* *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి:-* ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ఆసక్తిగా ఉందని ఆ దేశ రాయబారి ఓనో కేయిచ్చి తెలిపారు. విశాఖపట్నంలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఓనో కేయిచ్చి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఈ మేరకు స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఆసక్తిగా ఉన్నారని కేయిచ్చి సీఎంకు వివరించారు. జపాన్ ఫార్మా రాజధాని కొయామా మాదిరిగానే ఏపీని ఔషధ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు జపాన్ సహకారం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. జపాన్‌ పనితీరు తనకు ఎంతో ఇష్టమని ముఖ్యమంత్రి తెలిపారు. సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమిట్‌లో 20కి పైగా జపాన్ కంపెనీలు పాల్గొనడం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో భవన నిర్మాణాల్లో జపాన్, సింగపూర్ ప్రతినిధులను ఆహ్వానించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. శ్రీ సిటీలో ఇప్పటికే అనేక జపాన్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సీఎo చంద్రబాబు కేయిచ్చితో తెలిపారు.

*ఏపీలో స్టీల్ రంగంలో పెట్టుబడులకు జపాన్ కంపెనీల ఆసక్తి*

*ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన భేటీలో జపాన్ రాయబారి ఒనో కేయిచ్చి*

*విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి:-* ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ఆసక్తిగా ఉందని ఆ దేశ రాయబారి ఓనో కేయిచ్చి తెలిపారు. విశాఖపట్నంలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఓనో కేయిచ్చి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఈ మేరకు స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఆసక్తిగా ఉన్నారని కేయిచ్చి సీఎంకు వివరించారు. జపాన్ ఫార్మా రాజధాని కొయామా మాదిరిగానే ఏపీని ఔషధ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు జపాన్ సహకారం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. జపాన్‌ పనితీరు తనకు ఎంతో ఇష్టమని ముఖ్యమంత్రి తెలిపారు. సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమిట్‌లో 20కి పైగా జపాన్ కంపెనీలు పాల్గొనడం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో భవన నిర్మాణాల్లో జపాన్, సింగపూర్ ప్రతినిధులను ఆహ్వానించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. శ్రీ సిటీలో ఇప్పటికే అనేక జపాన్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సీఎo చంద్రబాబు కేయిచ్చితో తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.