
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో 43 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు సంఖ్య 1,930 కు చేరింది.999 మంది చికిత్స పొదుతుండగా,ఇప్పటివరకు 887 మంది డిశ్చార్జ్ అయ్యారు.గత 24 గంటల్లో ముగ్గురు మరణించడంతో కరోనా మరణాలు 44కి చేరాయి.తాజా కేసుల్లో అనంతపురం జిల్లాలో 3,విశాఖ జిల్లాలో 5,గుంటూరు జిల్లాలో 2,చిత్తూరులో 11,కర్నూలులో 6,కృష్ణాజిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి.

