అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 5 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్) : ఏటికొప్పాక గ్రామంలో బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సతీష్, వైస్ ప్రెసిడెంట్ నర్సింగరావు నాయకత్వంలో కుల పెద్దలు, కులస్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ గారికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ వేడుకలు గ్రామంలో సామాజిక ఐక్యత, యువత చైతన్యానికి ప్రతీకగా నిలిచాయి.





