*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్స్ అమలు వెంటనే నిలుపుదల చేయాలని నిరసన తెలియజేయడం జరిగింది, ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఏఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి ఎస్ జె అచ్యుతారావు మాట్లాడుతూ స్వాతంత్రం పూర్వకముందు నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ విధానాలకు అనుగుణంగా 200 సంవత్సరాల వెనకకు నెట్టుతూ దేశ కార్మికులను అంబానీ అదానీలకు కట్టు బానిసలుగా కార్పొరేట్ శక్తులకు విడిగం చేస్తూ భారత కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూనుకున్నారు ఈ నాలుగు కోడ్స్ మూలంగా కార్మికుల సమ్మె చేసే హక్కులు కోల్పోతున్నారు యాజమాన్య ని రింకశాత్వానికి బానిసలు అవుతారు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు కోల్పోతారు భారత కార్మిక వర్గం వెట్టి చాకిరీ కి గురవుతుందని కావున వెంటనే ఈ కోడును రద్దు చేయాలని లేనిపక్షంలో భారత కార్మిక వర్గం మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు, నరేంద్ర మోడీ ఎన్ డి ఏ కూటములు భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసి దేశ లౌకిక విధానానికి విఘాతం కలిగిస్తూ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయడానికి ప్రయత్నం చేయడానికి భారతదేశ కార్మిక వర్గం సహించగలదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీహెచ్ మెషిన్ బూసి వెంకట్రావు ఎం మన్మధరావు జెడి నాయుడు కే సత్తిబాబు నాగభూషణం ఓమనమూర్తి అధిక సంఖ్యలో ఏఐటియు సి శ్రేణులు పాల్గొన్నారు

ఏఐటీయూసీ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్స్ అమలు వెంటనే నిలుపుదల చేయాలని నిరసన
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్స్ అమలు వెంటనే నిలుపుదల చేయాలని నిరసన తెలియజేయడం జరిగింది, ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఏఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి ఎస్ జె అచ్యుతారావు మాట్లాడుతూ స్వాతంత్రం పూర్వకముందు నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ విధానాలకు అనుగుణంగా 200 సంవత్సరాల వెనకకు నెట్టుతూ దేశ కార్మికులను అంబానీ అదానీలకు కట్టు బానిసలుగా కార్పొరేట్ శక్తులకు విడిగం చేస్తూ భారత కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూనుకున్నారు ఈ నాలుగు కోడ్స్ మూలంగా కార్మికుల సమ్మె చేసే హక్కులు కోల్పోతున్నారు యాజమాన్య ని రింకశాత్వానికి బానిసలు అవుతారు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు కోల్పోతారు భారత కార్మిక వర్గం వెట్టి చాకిరీ కి గురవుతుందని కావున వెంటనే ఈ కోడును రద్దు చేయాలని లేనిపక్షంలో భారత కార్మిక వర్గం మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు, నరేంద్ర మోడీ ఎన్ డి ఏ కూటములు భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసి దేశ లౌకిక విధానానికి విఘాతం కలిగిస్తూ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయడానికి ప్రయత్నం చేయడానికి భారతదేశ కార్మిక వర్గం సహించగలదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీహెచ్ మెషిన్ బూసి వెంకట్రావు ఎం మన్మధరావు జెడి నాయుడు కే సత్తిబాబు నాగభూషణం ఓమనమూర్తి అధిక సంఖ్యలో ఏఐటియు సి శ్రేణులు పాల్గొన్నారు

