Tuesday, 24 March 2026
  • Home  
  • ఎస్.కే.ఆర్.డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
- గూడూరు

ఎస్.కే.ఆర్.డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, అధ్యాపక సిబ్బంది మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘అంతరాయాన్ని అధిగమించడం, ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం’ అనే థీమ్తో 2025 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని సమాజంలో ఎయిడ్స్ బాధితులను చిన్నచూపు చూడటం లాంటి అంతరాలను తొలగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విధమైన పిలుపునిచ్చిందని, 2030 నాటికి ఎయిడ్స్ అంతం చేసే లక్ష్యాన్ని చేరుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో అందరి సహకారం అవసరమని, హెచ్ఐవిపై అవగాహన పెంచేందుకు, బాధితులపై వివక్షను రూపుమాపేందుకు, నేడు పలుచోట్ల అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగానే కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విద్యార్థులుగా దీనిపై అవగాహన పెంచుకొని మన పొరుగు ప్రాంతాలలో కూడా నిరక్షరాస్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కళాశాల నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, శ్రీధర్ శర్మ, డాక్టర్ కే. శివప్రసాద్, డాక్టర్ విజయ మహేష్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ రాజు, అధ్యాపకులు డాక్టర్ ఝాన్సీ వాణి, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు, లక్ష్మీ హిమబిందు, గోపాల్, జనార్ధన్, భాష, సురేష్, శైలజ, సుందరమ్మ, ఉష, వినయ్, రమేష్ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, అధ్యాపక సిబ్బంది మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘అంతరాయాన్ని అధిగమించడం, ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం’ అనే థీమ్తో 2025 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని సమాజంలో ఎయిడ్స్ బాధితులను చిన్నచూపు చూడటం లాంటి అంతరాలను తొలగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విధమైన పిలుపునిచ్చిందని, 2030 నాటికి ఎయిడ్స్ అంతం చేసే లక్ష్యాన్ని చేరుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో అందరి సహకారం అవసరమని, హెచ్ఐవిపై అవగాహన పెంచేందుకు, బాధితులపై వివక్షను రూపుమాపేందుకు, నేడు పలుచోట్ల అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగానే కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విద్యార్థులుగా దీనిపై అవగాహన పెంచుకొని మన పొరుగు ప్రాంతాలలో కూడా నిరక్షరాస్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కళాశాల నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, శ్రీధర్ శర్మ, డాక్టర్ కే. శివప్రసాద్, డాక్టర్ విజయ మహేష్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ రాజు, అధ్యాపకులు డాక్టర్ ఝాన్సీ వాణి, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు, లక్ష్మీ హిమబిందు, గోపాల్, జనార్ధన్, భాష, సురేష్, శైలజ, సుందరమ్మ, ఉష, వినయ్, రమేష్ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.