ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని విద్యార్థినీ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివప్రసాద్ మాట్లాడుతూ విద్య సమాజానికి పునాది అని మరియు ఉపాధ్యాయులు దాని రూపశిల్పులు అని ఆనాడు స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు విశ్వసించాడని, ఆయన తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని కోరిన మహనీయుడని, ఆ స్ఫూర్తితో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదని మరియు గ్రహించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలియజేశారు. అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, అధ్యాపకులు శ్రీధర్ శర్మ, డాక్టర్ గోవింద్ సురేంద్ర, డాక్టర్ ఝాన్సీ వాణి, డాక్టర్ బి. పీర్ కుమార్, రవిరాజు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణ రాజు, మాట్లాడుతూ ఉపాధ్యాయ సేవలు ప్రతి విద్యార్థి సక్రమంగా వినియోగించుకోవాలని విద్యార్థిని విద్యార్థులను ఆశీర్వదించారు. అనంతరం ప్రిన్సిపాల్తో సహా అధ్యాపక బృందానికి విద్యార్థిని విద్యార్థులు బహుమతులు అందించి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ కోటేశ్వరరావు, ఎన్.సి.సి. కోఆర్డినేటర్ శ్రీమతి మైమూన్, డాక్టర్ శైలజ, కిరణ్మయి, కృపా కరుణ వాణి, తదితర అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని విద్యార్థినీ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివప్రసాద్ మాట్లాడుతూ విద్య సమాజానికి పునాది అని మరియు ఉపాధ్యాయులు దాని రూపశిల్పులు అని ఆనాడు స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు విశ్వసించాడని, ఆయన తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని కోరిన మహనీయుడని, ఆ స్ఫూర్తితో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదని మరియు గ్రహించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలియజేశారు. అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, అధ్యాపకులు శ్రీధర్ శర్మ, డాక్టర్ గోవింద్ సురేంద్ర, డాక్టర్ ఝాన్సీ వాణి, డాక్టర్ బి. పీర్ కుమార్, రవిరాజు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణ రాజు, మాట్లాడుతూ ఉపాధ్యాయ సేవలు ప్రతి విద్యార్థి సక్రమంగా వినియోగించుకోవాలని విద్యార్థిని విద్యార్థులను ఆశీర్వదించారు. అనంతరం ప్రిన్సిపాల్తో సహా అధ్యాపక బృందానికి విద్యార్థిని విద్యార్థులు బహుమతులు అందించి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ కోటేశ్వరరావు, ఎన్.సి.సి. కోఆర్డినేటర్ శ్రీమతి మైమూన్, డాక్టర్ శైలజ, కిరణ్మయి, కృపా కరుణ వాణి, తదితర అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

