రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 27:
ఇటీవలె కాకినాడ పార్లమెంట్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన రౌతులపూడి మండలం ఎస్ పైడిపాల గ్రామానికి చెందిన గొల్లు వరలక్ష్మి లక్ష్మణామూర్తి ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరుపులు సత్య ప్రభ రాజాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా వరుపుల సత్య ప్రభ మాట్లాడుతూ పార్టీ కోసం మరింత బలంగా పనిచేయాలని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సత్య ప్రభ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పైలా వేణుగోపాల్, ఎస్ పైడిపాల తెలుగుదేశం నాయకులు ఈగల సత్తిబాబు, గండేపల్లి శివ, పసగొడుగుల వెంకటరమణ, మల్లంపేట తెలుగుదేశం నాయకులు శ్రీరంరెడ్డి శ్రీను, జట్ల రాజా మరియు రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


