Tuesday, 24 March 2026
  • Home  
  • ఎపి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సేవలు అభినందనీయం!* *ఘనంగా 19వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు* *నిరుపేదలకు అన్నదానం వస్త్రదానం పంపిణీ*
- విశాఖపట్నం

ఎపి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సేవలు అభినందనీయం!* *ఘనంగా 19వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు* *నిరుపేదలకు అన్నదానం వస్త్రదానం పంపిణీ*

ఎపి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రముఖ సంఘ సేవకులు..ఎఎన్ బీచ్ ఆసుపత్రి అధినేత, ప్రముఖ వైద్యులు, డాక్టర్ సిఎంఎ జహీర్ అహ్మద్ కొనియాడారు. బుధవారం ఎపిడబ్ల్యూజెఎఫ్ 19వ వార్షికోత్సవం సందర్భంగా నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలోని వివేకానంద అనాధ.. వృద్ధుల ఆశ్రమంలో యూనియన్ నేతలు వస్త్ర దానం, అన్నదానం తదితర పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జహీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అతి పెద్దదైన జర్నలిస్ట్ సంఘంగా గుర్తింపు తెచ్చుకున్న ఎపిడబ్ల్యూజెఎఫ్ సభ్యులందరూ సమైక్యంగా ఉంటూ పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గత 19 సంవత్సరాలు నుంచి జర్నలిస్టుల సమస్యల సాధన పట్ల చిత్త శుద్ధితో పనిచేస్తూ మెజారిటీ జర్నలిస్టుల ఆదరణ పొందడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ పరిధి మేరకు నిరంతరం కృషి చేస్తున్నా మన్నారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం మంత్రులకు, ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు… జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇస్తున్న విధంగా 60 సంవత్సరములు నిండిన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని, హెల్త్ కార్డులు ద్వారా ఆరోగ్య పరిరక్షణ కల్పించాలని తదితర 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేశామన్నారు.. అలాగే రాష్ట్ర మంత్రులకు, ప్రభుత్వ పెద్దలకు ఇప్పటికే వినతులు అందజేస్తామన్నారు. ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఆర్ధికంగా నిలద్రొక్కు కునేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా తన తోడ్పాటును అందించాలని కోరారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పేదలకు అన్నదానం, వస్త్రదానం తదితర సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించా మన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నా యన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు డి. రవికుమార్, పి.ఎస్.ప్రసాద్ ఉపాధ్యక్షులు బి.శివప్రసాద్, ఎన్ రామకృష్ణ, జాయింట్ సెక్రెటరీ నగేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆనంద్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జగన్మోహన్, కే. శ్రీనివాస్, ప్రతినిధులు కే.డి.చక్రధరరావు, హరి, కె.వి.శర్మ , రాజశేఖర్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు

ఎపి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రముఖ సంఘ సేవకులు..ఎఎన్ బీచ్ ఆసుపత్రి అధినేత, ప్రముఖ వైద్యులు, డాక్టర్ సిఎంఎ జహీర్ అహ్మద్ కొనియాడారు. బుధవారం ఎపిడబ్ల్యూజెఎఫ్ 19వ వార్షికోత్సవం సందర్భంగా నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలోని వివేకానంద అనాధ.. వృద్ధుల ఆశ్రమంలో యూనియన్ నేతలు వస్త్ర దానం, అన్నదానం తదితర పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జహీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అతి పెద్దదైన జర్నలిస్ట్ సంఘంగా గుర్తింపు తెచ్చుకున్న ఎపిడబ్ల్యూజెఎఫ్ సభ్యులందరూ సమైక్యంగా ఉంటూ పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గత 19 సంవత్సరాలు నుంచి జర్నలిస్టుల సమస్యల సాధన పట్ల చిత్త శుద్ధితో పనిచేస్తూ మెజారిటీ జర్నలిస్టుల ఆదరణ పొందడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ పరిధి మేరకు నిరంతరం కృషి చేస్తున్నా మన్నారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం మంత్రులకు, ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు… జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇస్తున్న విధంగా 60 సంవత్సరములు నిండిన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని, హెల్త్ కార్డులు ద్వారా ఆరోగ్య పరిరక్షణ కల్పించాలని తదితర 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేశామన్నారు.. అలాగే రాష్ట్ర మంత్రులకు, ప్రభుత్వ పెద్దలకు ఇప్పటికే వినతులు అందజేస్తామన్నారు. ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఆర్ధికంగా నిలద్రొక్కు కునేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా తన తోడ్పాటును అందించాలని కోరారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పేదలకు అన్నదానం, వస్త్రదానం తదితర సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించా మన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నా యన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు డి. రవికుమార్, పి.ఎస్.ప్రసాద్ ఉపాధ్యక్షులు బి.శివప్రసాద్, ఎన్ రామకృష్ణ, జాయింట్ సెక్రెటరీ నగేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆనంద్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జగన్మోహన్, కే. శ్రీనివాస్, ప్రతినిధులు కే.డి.చక్రధరరావు, హరి, కె.వి.శర్మ , రాజశేఖర్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.