అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య విజయవాడ వెళ్తూ దర్శి లో దర్శి నియోజకవర్గ బీసీ నాయకులు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు .వాల్మీకి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్శి నియోజకవర్గ బీసీ కోర్ కమిటీ సభ్యులు, టీచర్ మీనీగ శ్రీను ఏర్పాటుచేసిన అల్పాహార విందులో పాల్గొని బీసీల హక్కుల పోరాటం గురించి బీసీల ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అని చెప్పి వారు ఉద్ఘాటించారు. అనంతరం వారిని బిసి సంఘ నాయకులు దుశాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల బిసి ప్రధాన కార్యదర్శి విజ్జగిరి శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షులు వరకాల వెంకటేశ్వర్లు దర్శి పట్టణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు అంకాల శ్రీను కోర్ కమిటీ సభ్యులు ప్రముఖ న్యాయవాది గడ్డి శ్రీనివాసులు, అన్నవరపు వెంకటేశ్వర్లు, బల్లగిరి శ్రీనివాసులు, ముండ్లమూరు మండల బీసీ నాయకులు మీనిగ వెంకటేశ్వర్లు, పూరిమెట్ల ఎంపీటీసీ చింతలపల్లి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ చొప్పవరపు సుబ్బారావు మరియు బీసీ సంఘ సభ్యులు పాల్గొన్నారు.