(హైదరాబాద్ — పున్నమి ప్రతినిధి)
ఉప సర్పంచ్లకు ఉన్న చెక్ పవర్ను రద్దు చేస్తున్నట్లు ప్రచారం జరిగిన వార్తలను తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టం చేసింది. మంగళవారం సాయంత్రం చెక్ పవర్ రద్దుపై ప్రత్యేక జీవో జారీ చేశారన్న ప్రచారం, సర్క్యులర్ వైరల్ కావడంతో గందరగోళం ఏర్పడింది. అయితే అవన్నీ అవాస్తవమని అధికారులు తేల్చిచెప్పారు. ఉప సర్పంచ్ల అధికారాలు యథాతథంగానే కొనసాగుతున్నాయని తెలిపారు.


