కలిగిరి సెప్టెంబర్ 5 : పున్నమి న్యూస్ ప్రతినిధి నాగరాజు ://///
కలిగిరి లోని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మేడం నరసింహారెడ్డి మాట్లాడుతూ కలిగిరి గ్రామానికి చెందిన గోసాల మహేష్ అలియాస్ బాబి నీ అలాగే ముఖ్యంగా కలిగిరి ఎస్సై ఉమాశంకర్ ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఒకరు కబడ్డీ నేర్పే ఉపాధ్యాయులు అయితే,,, ఇంకొకరు సమాజంలో చెడును ఎలా తొలగించాలని యువతను తయారు చేసే పోలీస్ వృత్తిలో ఉపాధ్యాయులు, కనుక ఈ సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారి ఇరువురిని ఘనంగా సన్మానించడం జరిగింది. అని ఆయన అన్నారు సంతోషకరమైన ఈ కార్యక్రమంలో ఆయనతో కలిసి జనసేన నుంచి దిలీప్ కుమార్, శివ, మరియు ముఖ్యంగా మదర్ తెరిసా మిరాకిల్ సమస్త సభ్యులు ఐమూరి శాంసన్, ఐమూరి మోజెస్, జి ఈశ్వర్, తదితరులు పాల్గొనడం జరిగిందని ఆయన అన్నారు.


