ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చి నిర్వీర్యం చేస్తే సహించబోమని మనుబోలు మండల సీపీఎం కార్యదర్శి దేవదానం హెచ్చరించారు. బుధవారం మండలంలోని మడమనూరు గ్రామంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. గాంధీజీ పేరును తొలగించడం జాతి అవమానమన్నారు. కొత్త చట్టంతో రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందన్నారు. వేతనాన్ని కనీసం రూ.400 చేయాలని, రైతులతో ఉపాధి హామీ చట్టాన్ని అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బీసీ భాస్కర్ పాల్గొన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోం – సీపీఎం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చి నిర్వీర్యం చేస్తే సహించబోమని మనుబోలు మండల సీపీఎం కార్యదర్శి దేవదానం హెచ్చరించారు. బుధవారం మండలంలోని మడమనూరు గ్రామంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. గాంధీజీ పేరును తొలగించడం జాతి అవమానమన్నారు. కొత్త చట్టంతో రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందన్నారు. వేతనాన్ని కనీసం రూ.400 చేయాలని, రైతులతో ఉపాధి హామీ చట్టాన్ని అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బీసీ భాస్కర్ పాల్గొన్నారు.

