పున్నమి ప్రతి నిధి
జమ్మూ & కశ్మీర్లోని ఉదంపూర్లో ఉన్న 15వ బెటాలియన్ కేంద్రంలో జరిగిన 64వ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) రైజింగ్ డే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరై న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూమర్
ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సింహా గారు, ఐటీబీపీ డీజీ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు, మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ముందుగా అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం కొత్త నివాస మరియు ఆపరేషనల్ సౌకర్యాలను ప్రారంభించి, పరేడ్ సందర్భంగా ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీలు మరియు పతకాలను ప్రదానం చెయ్యడం జరిగింది
సమావేశం లో బండి సంజయ్ మాట్లాడుతు
మన హిమవీరుల త్యాగాలు అమూల్యం. –45°C వరకు తగ్గే ఉష్ణోగ్రతలు, తక్కువ ఆక్సిజన్ ఉన్న కఠిన పరిస్థితుల్లో 3,488 కి.మీ. భారత–చైనా సరిహద్దును కాపాడడం వారి అసాధారణ సేవ. దేశం వారి సంకల్పం నుంచి శక్తి పొందుతుందన్నారు
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఐటీబీపీకై పలు సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేసిందని ఆధునిక పరికరాలు అందించి, కీలకమైన మౌలిక వసతులను పూర్తిచేసి, 5,900 మందికి పైగా సిబ్బందిని నియమించి, 2,400 ఫిర్యాదులను పరిష్కరించిందని తెలియజేసారు
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో, ప్రతి ఐటీబీపీ సిబ్బంది మరియు వారి కుటుంబాల సంక్షేమం, ఆధునికీకరణ, అవశ్యక సహకారం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
బండి సంజయ్ కూమర్


