పలమనేరు ,జులై3,2020(పున్నిమి విలేకరి): జాతీయ స్థాయి కార్మిక ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, ఉద్యోగుల వ్యతిరేక విధానాలపై స్ధానిక ఎన్జీఒ హోం ముందర ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎపీఎన్జీఒ సంఘం పలమనేరు తాలూకా అధ్యక్షుడు ఆనందబాబు మాట్లాడుతూ… ఉద్యోగ వ్యతిరేక ధోరణి సమర్ధనీయం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం PFRDA బిల్లు రద్దు చేయాలని, వెంటనే కరువుభత్యం నిలుపుదల ఉత్తర్వుల ఉపసంహరణ చేయాలని కోరారు . సంఘం కార్యదర్శి సి.కె.బాలాజీ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని , ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని అదేవిధంగా, కోవిడ్-19 బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులు ,వర్కర్స్ కు ఇన్సూరెన్స్ వర్తింపు, అధిక ధరలను అరికట్టడం తదితర డిమాండ్స్ నెరవేర్చాలని తెలిపారు. ఉద్యోగులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గురుకుమార్,సురేష్, సోమసుందర్ ,మోహన్, రాంప్రసాద్, మోగిలప్ప,నారాయణ,సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ వ్యతిరేక ధోరణి సమర్ధనీయం కాదు
పలమనేరు ,జులై3,2020(పున్నిమి విలేకరి): జాతీయ స్థాయి కార్మిక ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, ఉద్యోగుల వ్యతిరేక విధానాలపై స్ధానిక ఎన్జీఒ హోం ముందర ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎపీఎన్జీఒ సంఘం పలమనేరు తాలూకా అధ్యక్షుడు ఆనందబాబు మాట్లాడుతూ… ఉద్యోగ వ్యతిరేక ధోరణి సమర్ధనీయం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం PFRDA బిల్లు రద్దు చేయాలని, వెంటనే కరువుభత్యం నిలుపుదల ఉత్తర్వుల ఉపసంహరణ చేయాలని కోరారు . సంఘం కార్యదర్శి సి.కె.బాలాజీ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని , ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని అదేవిధంగా, కోవిడ్-19 బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులు ,వర్కర్స్ కు ఇన్సూరెన్స్ వర్తింపు, అధిక ధరలను అరికట్టడం తదితర డిమాండ్స్ నెరవేర్చాలని తెలిపారు. ఉద్యోగులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గురుకుమార్,సురేష్, సోమసుందర్ ,మోహన్, రాంప్రసాద్, మోగిలప్ప,నారాయణ,సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.