Sunday, 7 December 2025
  • Home  
  • *ఉద్యోగుల డిమాండ్లపై సీఎం స్పందన హర్షణీయం — AGTUPSS*
- ఆంధ్రప్రదేశ్

*ఉద్యోగుల డిమాండ్లపై సీఎం స్పందన హర్షణీయం — AGTUPSS*

దీపావళి కానుకగా దీపావళికి ముందే ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వంతో సమావేశం ఏర్పాటు చేయాలని పట్టుబట్టి, ఆ సమావేశాన్ని సాధించ గలిగిన ఏపీ జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్,ప్రధాన కార్యదర్శి డి.వి. రమణకు అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ ల సంఘాల తరఫున అభినందనలు తెలపడమైనది.ఈ సందర్భంగా ఆదివారం అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాద్యాయ పెన్షనర్ ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. 👉నవంబర్ నెల నుంచి ఒక డి.ఏ. (3.640) ను విడుదల చేయడం, 👉60 రోజుల్లో హెల్త్ కార్డుల వ్యవస్థను సక్రమంగా నడిపించేందు కు కమిటీని ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించడం, 👉 ఆర్‌టీసీ ఉద్యోగుల ప్రమోషన్‌లపై వారం రోజులలో ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల AGTUPSS నాయకులు హర్షం వ్యక్తం చేశారు. 👉దీపావళి పండుగకు ముందే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం,ముఖ్యమంత్రితో మరియు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో జరిగిన స్నేహపూర్వక మైన, గౌరవప్రదమైన,హుందాతన చర్చలు — దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో జరగడం చాలా సంతోష దాయకమని అన్నారు. 👉చైల్డ్ కేర్ లీవ్‌పై ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మహిళా ఉద్యోగులలో ఆనందాన్ని నింపిందని అన్నారు. 👉హెల్త్ కార్డుల విషయంలో ప్యాకేజీ రేట్లు పెంచడం, జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స పరిమితిని ₹ 50,000 నుండి ₹ 1,00,000 కి పెంచడం, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ నేరుగా ట్రస్ట్ ఖాతాలో జమయ్యేలా చూడటం, వైద్య సేవల సీలింగ్‌ను ₹ 2.00 లక్షల నుండి ₹ 5.00 లక్షల పైబడేలా పెంచడం,అలాగే ఆరోగ్యశ్రీ (EHS) విధానాన్ని ఇన్సూరెన్స్ మోడల్‌గా మార్చే అవకాశాలను పరిశీలించాలని కమిటీకి ఆదేశించడo,ఇవన్నీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా పెన్షనర్లలో ఆనందాన్ని కలిగించాయన్నారు. 👉పి.ఆర్సి కమిటీ ఏర్పాటు విషయంలోనూ, 👉57వ మెమో ప్రకారం సుమారు 11,000 మంది ఉద్యోగులను ఓపిఎస్ (OPS) పద్ధతిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడాన్ని కూడా AGTUPSS హర్షించింది. మిగిలిన సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడమైనది. 👉ఉద్యోగుల సమస్యల సాధనలో ఇది మొదటి అడుగు మాత్రమేనని, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, గ్రామ వార్డు సచివాలయాల నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్, గురుకుల పాఠశాలలో ప్రభుత్వ రంగ సంస్థల వయోపరిమితి 60 నుంచి 62 పెంచడం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత మరియు ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం చేయడం, మిగతా అన్ని అంశాల పరిష్కారం కోసం విద్యాసాగర్, రమణల నాయకత్వంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మరియు ఏపీ జేఏసీ నిరంతరం కృషి చేస్తుందని తెలపడమైనది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్,పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, చీఫ్ సెక్రటరీ విజయానంద్,ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ పక్షాన ధన్యవాదాలు తెలిపింది.

దీపావళి కానుకగా దీపావళికి ముందే ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వంతో సమావేశం ఏర్పాటు చేయాలని పట్టుబట్టి, ఆ సమావేశాన్ని సాధించ గలిగిన ఏపీ జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్,ప్రధాన కార్యదర్శి డి.వి. రమణకు అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ ల సంఘాల తరఫున అభినందనలు తెలపడమైనది.ఈ సందర్భంగా ఆదివారం అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాద్యాయ పెన్షనర్ ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు.
👉నవంబర్ నెల నుంచి ఒక డి.ఏ. (3.640) ను విడుదల చేయడం,
👉60 రోజుల్లో హెల్త్ కార్డుల వ్యవస్థను సక్రమంగా నడిపించేందు కు కమిటీని ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించడం,
👉 ఆర్‌టీసీ ఉద్యోగుల ప్రమోషన్‌లపై వారం రోజులలో ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల AGTUPSS నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

👉దీపావళి పండుగకు ముందే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం,ముఖ్యమంత్రితో మరియు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో జరిగిన స్నేహపూర్వక మైన, గౌరవప్రదమైన,హుందాతన చర్చలు — దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో జరగడం చాలా సంతోష దాయకమని అన్నారు.

👉చైల్డ్ కేర్ లీవ్‌పై ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మహిళా ఉద్యోగులలో ఆనందాన్ని నింపిందని అన్నారు.
👉హెల్త్ కార్డుల విషయంలో ప్యాకేజీ రేట్లు పెంచడం, జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స పరిమితిని ₹ 50,000 నుండి ₹ 1,00,000 కి పెంచడం, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ నేరుగా ట్రస్ట్ ఖాతాలో జమయ్యేలా చూడటం, వైద్య సేవల సీలింగ్‌ను ₹ 2.00 లక్షల నుండి ₹ 5.00 లక్షల పైబడేలా పెంచడం,అలాగే ఆరోగ్యశ్రీ (EHS) విధానాన్ని ఇన్సూరెన్స్ మోడల్‌గా మార్చే అవకాశాలను పరిశీలించాలని కమిటీకి ఆదేశించడo,ఇవన్నీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా పెన్షనర్లలో ఆనందాన్ని కలిగించాయన్నారు.

👉పి.ఆర్సి కమిటీ ఏర్పాటు విషయంలోనూ,
👉57వ మెమో ప్రకారం సుమారు 11,000 మంది ఉద్యోగులను ఓపిఎస్ (OPS) పద్ధతిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడాన్ని కూడా AGTUPSS హర్షించింది. మిగిలిన సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడమైనది.

👉ఉద్యోగుల సమస్యల సాధనలో ఇది మొదటి అడుగు మాత్రమేనని, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, గ్రామ వార్డు సచివాలయాల నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్, గురుకుల పాఠశాలలో ప్రభుత్వ రంగ సంస్థల వయోపరిమితి 60 నుంచి 62 పెంచడం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత మరియు ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం చేయడం, మిగతా అన్ని అంశాల పరిష్కారం కోసం విద్యాసాగర్, రమణల నాయకత్వంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మరియు ఏపీ జేఏసీ నిరంతరం కృషి చేస్తుందని తెలపడమైనది.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్,పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, చీఫ్ సెక్రటరీ విజయానంద్,ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ పక్షాన ధన్యవాదాలు తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.