విశాఖపట్నం:
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీలు – వార్డు, క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం నగరంలోని టిడిపి కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు ఎం. శ్రీభరత్, ప్రభుత్వ విప్ డా. వ్యాపాడ చిరంజీవిరావు కమిటీ ప్రతినిధులకు ప్రమాణ స్వీకారం చేయించారు.
కార్యక్రమానికి ముందు బహుజన చైతన్య సారథి డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి మాల్యార్పణ చేయడం జరిగింది.
డా. వ్యాపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ—
ఉత్తర నియోజకవర్గంలో పార్టీ శక్తిని మరింత బలోపేతం చేయడానికి కొత్త కమిటీల ఏర్పాటుతో బలమైన బృందం సిద్ధమైందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి విజయధ్వజం ఎగురవేయడం లక్ష్యంగా ప్రతిఒక్కరూ కట్టుబడి పనిచేయాలి అని పిలుపునిచ్చారు.
విశాఖపట్నం అభివృద్ధిలో టిడిపి పాత్రను ప్రజలకు చేరవేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఉత్తర నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


