విశాఖ ఉక్కు కాంట్రాక్టు పనుల్లో స్థానికులను పక్కనపెట్టి ఇతర రాష్ట్రాల వారిని నియమిస్తే సహించబోమని టీడీపీ నేతలు హెచ్చరించారు. నిర్వాసితులు, స్థానికులకు ముందుగానే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం, ఏజెన్సీల తీరుపై నేతలు అసహనం వ్యక్తం చేశారు.


