- ఈనెల 27న పెద్దపేటలో జగన్నాథుని రథయాత్
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని పెద్దపేటలో ఈనెల 27వ తేదీన జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా ప్రారంభంకానుంది. గ్రామంలో ఇప్పటికే ఉత్సవ శోభ అలముకుంది. పంచాయతీ, స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించనున్నారు.

