Thursday, 5 February 2026
  • Home  
  • ఈనెల 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- విశాఖపట్నం

ఈనెల 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఈనెల 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము *తిరుపతి*(విశాఖ పున్నమి ప్రతినిధి):- 20న తిరుచానూరు అమ్మవారి దర్శనం, ఆలయ సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామి దర్శనం రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై టీటీడీ అధికారుల సమీక్ష భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 21న ఆమె స్వామివారి సేవలో పాల్గొంటారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె తిరుపతికి రానున్నారు. పర్యటనలో భాగంగా ఈ నెల‌ 20న రాష్ట్రపతి ముందుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటారు. మరుసటి రోజు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మొదట శ్రీ వరాహస్వామి వారిని, ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ మేరకు గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. రాష్ట్ర‌ప‌తి పర్యటన సందర్భంగా భద్రత, వసతి, దర్శన ఏర్పాట్లపై వారు చర్చించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు అదనపు ఈవో సూచించారు.

ఈనెల 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
*తిరుపతి*(విశాఖ పున్నమి ప్రతినిధి):-
20న తిరుచానూరు అమ్మవారి దర్శనం, ఆలయ సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామి దర్శనం

రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై టీటీడీ అధికారుల సమీక్ష

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 21న ఆమె స్వామివారి సేవలో పాల్గొంటారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె తిరుపతికి రానున్నారు. పర్యటనలో భాగంగా ఈ నెల‌ 20న రాష్ట్రపతి ముందుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటారు. మరుసటి రోజు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మొదట శ్రీ వరాహస్వామి వారిని, ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ మేరకు గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. రాష్ట్ర‌ప‌తి పర్యటన సందర్భంగా భద్రత, వసతి, దర్శన ఏర్పాట్లపై వారు చర్చించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు అదనపు ఈవో సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.