ఎర్పేడు పున్నమి న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తి నియోజిక వర్గ శాసన సబ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ముస్లిం మసీదు కమిటీ సభ్యులు ఎర్పేడు ప్రాంతంలో ఈద్గా కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలని కోరుతూ ముస్లిం సోదరులు బుధవారం నాడు బొజ్జల సుధీర్ రెడ్డిని ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ముస్లిం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి తమ సమస్యను వివరిస్తూ ప్రస్తుతం ఏర్పేడు చెరువు కలుజు వద్ద ఉన్న ప్రదేశాన్ని ముస్లిం సోదరులు ఈద్గా, స్మశానంగా ఉపయోగిస్తున్నారని అయితే ఆ ప్రాంతంలో చెరువు కట్టపై ఒకవైపు మలయాళ స్వామి విగ్రహం, మరోవైపు చర్చి నిర్మాణం ఉండటంతో మత ప్రార్థనలు నిర్వహించేందుకు సరిపడ స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వారితో ప్రస్తుతానికి ఉన్న ప్రదేశాన్నిస్మశానంగాఉపయోగించుకోవాలని త్వరలోని తాను తహసీల్దార్తో మాట్లాడి ముస్లిం సోదరులకు మరో అనువైన ప్రదేశంలో స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటానని కొత్తగా కేటాయించే స్థలంలో ఈద్గా నిర్మించుకుని భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని మలయాళ స్వామి విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశం నుంచి మరింత ఆక్రమణలు జరగకుండా చూసుకుంటానని మలయాళ స్వామి పేరుతో ఎవరైనా స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బొజ్జల వేంకట సుధీర్ రెడ్డి ను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈద్గా కోసం ప్రత్యేక స్థలం కావాలని ఎమ్మెల్యేకి ముస్లిం కమిటీ వినతి
ఎర్పేడు పున్నమి న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తి నియోజిక వర్గ శాసన సబ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ముస్లిం మసీదు కమిటీ సభ్యులు ఎర్పేడు ప్రాంతంలో ఈద్గా కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలని కోరుతూ ముస్లిం సోదరులు బుధవారం నాడు బొజ్జల సుధీర్ రెడ్డిని ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ముస్లిం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి తమ సమస్యను వివరిస్తూ ప్రస్తుతం ఏర్పేడు చెరువు కలుజు వద్ద ఉన్న ప్రదేశాన్ని ముస్లిం సోదరులు ఈద్గా, స్మశానంగా ఉపయోగిస్తున్నారని అయితే ఆ ప్రాంతంలో చెరువు కట్టపై ఒకవైపు మలయాళ స్వామి విగ్రహం, మరోవైపు చర్చి నిర్మాణం ఉండటంతో మత ప్రార్థనలు నిర్వహించేందుకు సరిపడ స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వారితో ప్రస్తుతానికి ఉన్న ప్రదేశాన్నిస్మశానంగాఉపయోగించుకోవాలని త్వరలోని తాను తహసీల్దార్తో మాట్లాడి ముస్లిం సోదరులకు మరో అనువైన ప్రదేశంలో స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటానని కొత్తగా కేటాయించే స్థలంలో ఈద్గా నిర్మించుకుని భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని మలయాళ స్వామి విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశం నుంచి మరింత ఆక్రమణలు జరగకుండా చూసుకుంటానని మలయాళ స్వామి పేరుతో ఎవరైనా స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బొజ్జల వేంకట సుధీర్ రెడ్డి ను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

