*ఇన్సర్వీస్ ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇప్పించి వారిలో ఉన్న అభద్రతాభావానికి త్వరలో ముగింపు పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర గౌరవాధ్యక్షులు*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ 27/03/2026*
*రాష్ట్రంలో దాదాపుగా 50వేల మంది పైచిలుకు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు గతంలో ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్,రాష్ట్ర ,శాఖ మరియు అన్ని జిల్లా శాఖల నుంచి విజ్ఞప్తి మేరకు గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి కి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారికి మెయిల్ పంపి తమ లెటర్ హెడ్ నుంచి విజ్ఞాపన చేయడం జరిగింది. అందులో భాగంగా వారు ఈరోజు స్థానిక క్యాంపు కార్యాలయంలో కలిసి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి గుర్తుచేస్తూ రాష్ట్రంలోని ఇన్సర్వీస్ ఉపాధ్యాయులందరికీ 2010 డీఎస్సీ కన్న ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుండి మినహాయింపు ఇప్పించి పార్లమెంటులో చట్ట సవరణ చేస్తూ అమెండ్మెంట్ చేయించి రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరిలో నెలకొన్న అభద్రత భావాన్ని త్వరలో ముగింపు పలికించాల్సిందిగా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్,తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మురళీకృష్ణ గారు కలిసి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది త్వరలో పార్లమెంటు ప్రస్తుత సెషన్ లోనే ఈ సమస్యకు స్వస్తి పలుకుతామని ఆమె హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలియజేశారు, వారు ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యురాలికి తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం పక్షాన రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర, జిల్లా శాఖల పక్షాన ధన్యవాదాలు తెలిపారు*


