శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి రోజు ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు దేవస్థానం వారు ఇంద్ర విమానం చప్రం వాహన సేవలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు శ్రీ స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, కళాకారుల నృత్యాల నడుమ పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్బంగా అలయ పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ… మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడికి 11 కాలాల్లో అభిషేకాలు చేస్తామని మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి స్వామివారిని దర్శించుకొని జాగారణ చేసి, లింగోద్భవ దర్శనం చేసుకోవడం ద్వారా పార్వతీ, పరమేశ్వరుల అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయని అయన తెలిపారు.

ఇంద్ర, చప్పర విమానలపై భక్తులకు దర్శనమిచ్చిన గౌరీదేవి శంకరులు
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి రోజు ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు దేవస్థానం వారు ఇంద్ర విమానం చప్రం వాహన సేవలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు శ్రీ స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, కళాకారుల నృత్యాల నడుమ పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్బంగా అలయ పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ… మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడికి 11 కాలాల్లో అభిషేకాలు చేస్తామని మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి స్వామివారిని దర్శించుకొని జాగారణ చేసి, లింగోద్భవ దర్శనం చేసుకోవడం ద్వారా పార్వతీ, పరమేశ్వరుల అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయని అయన తెలిపారు.

