నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి.
ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ , లబ్ధిదారుల పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ :–
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అందరు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఉట్నూర్ మండలం సాలైగూడ(74), రాం గూడ (56), ధర్మాజీపేట (31), కొలాం గూడాలను (36), పర్యటించారు. ఆయా గ్రామాల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి పెద్దలకు ఇందిరమ్మ ఇళ్ల అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,75,000 కేంద్ర ప్రభుత్వం లక్ష 25వేలు రూపాయలు నిధులు మాత్రమే మంజూరు చేసిందని మొత్తం మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
ఇండ్లు నిర్మించిన వారికి దశలవారీగా నిధులు మీ ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. పనులు నిర్మాణాలు నాణ్యవంతంగా సకాలంలో పూర్తి చేసుకోవాలని కోరారు. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మీకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో ,జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


